డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఉన్న ఒక అమ్మాయి… డ్యాన్సర్ గా మారి, ఆ తర్వాత నటిగా ఓ ప్రయోగం చేసి, స్టార్ హీరోయిన్ హోదాను తెచ్చుకుని ప్రస్తుతం లేడీ పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతుంది. ఆమె సాయి పల్లవి. సాయి పల్లవి ప్రధాన పాత్రలో చేసిన మలయాళ చిత్రం ప్రేమమ్ తో ఒక నటిగానే కాదు.. మంచి డ్యాన్సర్ గా కూడా గుర్తింపు వచ్చింది. దీని తర్వాత తెలుగులో హీరోయిన్ గా చేసిన ఫిదాతో సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు.
దీని తర్వాత సాయి పల్లవి నుంచి వచ్చిన ప్రతి సినిమాపై అంచనాలు ఉండేవి. ఆమె యాక్టింగ్, డ్యాన్స్ చూడటానికి ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇటీవల కాలంలో ఈమె నుంచి వచ్చిన విరాటపర్వం, గార్గి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా, ఈమె నటనకు మాత్రం ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గార్గి సినిమాకు బెస్ట్ యాక్టరస్ విభాగంలో పలు అవార్డులు కూడా వచ్చాయి. అయితే తన సిస్టర్ పూజా కన్నన్ తో కలిసి కోయంబత్తూర్ లో ఆస్పత్రి నిర్మిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా తమిళ స్టార్ శివకార్తికేయన్ SK21తో రీ ఎంట్రీ ఇచ్చింది.
అయితే, కెరీర్ పరంగా ఇంత సక్సెస్ ఫుల్ గా ఉన్న సాయి పల్లవి, పర్సనల్ విషయంలో మాత్రం ఒక సమస్యతో బాధపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవినే వెల్లడించింది. తన ఫేస్ పై ఉండే పింపుల్స్ గురించి ఓ సందర్భంలో వివరిస్తూ, తనకు రోసేసియా అనే వ్యాధి ఉన్నట్టు చెప్పింది. రోసేసియా అంటే, కెమెరా మరియు కాంతికి గురైనప్పుడల్లా, ముఖం గులాబీ రంగులోకి మారుతుంది. దీన్ని వైద్య భాషలో వ్యాధిగానే పరిగణస్తారట. ఈ వ్యాధి ఉన్నవాళ్లకు కొన్ని ముఖ రక్త నాళాలు విస్తరించి, బుగ్గలు మరియు ముక్కు ఎర్రబడుతాయట.
సాధారణంగా హీరోయిన్స్ కు ఫేస్ కు సంబంధించి ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు వాళ్లు హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం. కానీ, సాయి పల్లవి మాత్రం ఈ వ్యాధితోనే స్టార్ హీరోయిన్ గా, లేడీ పవర్ స్టార్ స్థాయి ఎదిగింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News