Anasuya : వారి వల్లే దూరం.. ఎట్టకేలకు నిజం ఒప్పుకుందా..?

Anasuya : బుల్లితెర గ్లామర్ బ్యూటీ ప్రముఖ సీనియర్ యాంకర్ అనసూయ ఒకప్పుడు జబర్దస్త్ లో తన అందచందాలతో, వాక్చాతుర్యంతో ఎంతోమంది అభిమానులను బుల్లితెరకి కట్టిపడేసి.. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాలలో అవకాశాలు వస్తుండడంతో జబర్దస్త్ మానేసిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 9 సంవత్సరాల పాటు జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగిన ఈమె ఉన్నట్టుండి మానేయడంతో అసలు కారణం తెలియక రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.. చాలాకాలంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈమెకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటిపై స్పందించకుండా తప్పించుకుంటోంది అనసూయ. ఎట్టకేలకు తాను జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల అసలు కారణాన్ని వెల్లడిచింది..

అందుకే జబర్దస్త్ నుంచి బయటకి వచ్చా..

2013లో ఒక ప్రముఖ ఛానల్లో జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయింది.. ఆ సమయంలో నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించగా .. అనసూయ ( Anasuya ) యాంకర్ గా వ్యవహరించింది.. అయితే 2022లో జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన అనసూయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పూర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు ఒక ప్రశ్న ఎదురయింది.. జబర్దస్త్ నుండి మీరే వెళ్ళిపోయారా? లేక వాళ్ళే తీసేసారా ? అని అడగ్గా నన్ను ఎవరైనా తీసేస్తారా ?నేనే మానేశాను.. దానికి కారణం ఆ సమయంలో నేను మూడు తెలుగు , మూడు తమిళ్ సినిమాలు చేస్తున్నాను. ఇక నా బిజీ షెడ్యూల్స్ కారణంగా మిగతా కమెడియన్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఈవెంట్స్, షెడ్యూల్ డిస్టర్బ్ అవుతున్నాయి. మన కారణంగా ఇతరులు ఇబ్బంది పడడం ఎందుకు అని నేనే జబర్దస్త్ మానేశాను. ఇప్పటికీ మల్లెమాల సంస్థతో నాకు మంచి రిలేషన్స్ కొనసాగుతున్నాయి. అలాగే కొన్ని ప్రపోజల్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము అంటూ తెలిపింది అనసూయ. మొత్తానికైతే నటిగా బిజీ కావడం వల్ల జబర్దస్త్ మానేసినట్లు స్పష్టం చేసింది.

గతంలో అలాంటి కామెంట్స్..

ఇకపోతే గతంలో టిఆర్పి స్టంట్స్ నచ్చడం లేదని, జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడుతున్నారని.. నటిగా, యాంకర్ గా కొనసాగుతుంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని కొన్ని కారణాలు చెప్పిన విషయం తెలిసిందే అయితే అవేవీ కాదు అని ఇప్పుడు మరొక కారణాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికైతే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమాల అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

- Advertisement -

అనసూయ సినీ కెరియర్..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో భారీ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ ఆ తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేసి మరింత క్రేజ్ దక్కించుకుంది. అంతేకాదు స్టార్ హీరోల చిత్రాలులో కూడా నటిస్తూ నేర్పిస్తున్న ఈమె మళ్లీ అదే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో పాన్ ఇండియా రేంజ్ లో పేరు దక్కించుకుంది. ప్రస్తుతం అనసూయ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది ఇక ఈ సినిమా గనుక హిట్ అయితే ఈమె పాన్ ఇండియా నటిగా సెటిల్ అయినట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు