Dhanush: హీరో ధనుష్ – ఐశ్వర్యకు కోర్టు నోటీసులు

Dhanush: భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ధనుష్. కొత్త కొత్త కథాంశాలతో, విలక్షణమైన నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు ధనుష్. ఈ హీరోకి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. “తల్లువదో ఇలవై” సినిమాతో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ధనుష్.. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు వాళ్లకు కనెక్ట్ అయ్యాడు. యాక్షన్, లవ్, కామెడీ.. ఇలా వైవిధ్య నటనతో ఎప్పటికప్పుడు పాత్రకు తగ్గట్టు తనను తాను మలుచుకుంటూ ఏ క్యారెక్టర్ లోనైనా ఒదిగిపోగలడు ధనుష్.

ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయంలోకి వెళితే.. ధనుష్, రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యలకు 2004లో ప్రేమ వివాహం జరిగిన విషయం తెలిసిందే. వారికి ఇద్దరు కుమారులు యాత్ర, లింగా ఉన్నారు. ధనుష్ – ఐశ్వర్య సుమారు 18 ఏళ్లపాటు కలిసి జీవించారు. 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక గత రెండేళ్లుగా వీరిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. వీరు పరస్పర అంగీకారంతోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ న్యాయమూర్తి సుభాదేవి ముందు సోమవారం విచారణకు వచ్చింది. దీంతో ధనుష్ – ఐశ్వర్యలను అక్టోబర్ 7న కోర్టులో హాజరుకావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నప్పటి నుండి వీరి కుమారులు యాత్ర, లింగా మాత్రం ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం ధనుష్ వద్దకు వెళ్లి వచ్చేవారు. ఇక ధనుష్ – ఐశ్వర్యలను కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ వీరు మాత్రం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు