Amitabh Bachchan: బ్లాస్టింగ్ న్యూస్… ఖాకీకి సీక్వెల్ ఫిక్స్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. హిట్ అయిన సినిమాలకు కొనసాగింపుగా కథలను సిద్దం చేస్తున్నారు దర్శకులు. కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా కథలు రెడీ అవుతున్నాయి. తాజాగా మరో సీక్వెల్ తెర మీదకు వచ్చింది. అదే ఖాకీ. ఖాకీ అంటే.. హీరో కార్తీ చేసిన ఖాకీ సినిమా కాదు.. దాదాపు 19 ఏళ్ల క్రితం బాలీవుడ్ అగ్ర నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ తో పాటు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించిన సినిమా ఖాకీ.

రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆ రోజుల్లో చాలా మందికి ఫేవరెట్ సినిమా. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఖాకీ సినిమాను నిర్మించిన కేశు రామ్ సే కుమారుడు ఆర్యేమాన్ ప్రకటించాడు. తాము ఖాకీ సీక్వెల్ కి చేయడానికి రెడీగా ఉన్నామని, ప్రస్తుతం సీక్వెల్ కి సరిపడ స్టోరీ రెడీ అవుతుందని, స్టోరీ రెడీ అయిన వెంటనే సీక్వెల్ పై ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చాడు.

అలాగే ఖాకీ సినిమా 2004లో విడుదలైందని, వచ్చే ఏడాదికి ఖాకీ సినిమాకు 20 ఏళ్లు అవుతుందని, కాబట్టి, 2024లోనే ఖాకీ సీక్వెల్ ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వివరించాడు. అయితే 2004లో వచ్చిన ఖాకీకి ఇప్పుడు రాబోయే ఖాకీ సీక్వెల్ కి లింక్ ఎలా ఉంటుందో అనేది కాస్త ఇంట్రెస్టింగ్ మారింది. ఎందుకంటే, ఖాకీ ఫస్ట్ పార్ట్ లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, ఐశ్వర్య రాయ్ పాత్రలను ముగించారు. మరీ వారి పాత్రలను మళ్లీ తీసుకువస్తారా? లేదా కొత్త పాత్రలకు ఏంట్రీ ఉంటుందా ? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే, సినిమాపై అనౌన్స్ మెంట్ రావాల్సిందే

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు