Amitabh Bachchan : సోషల్ పవర్.. బాలీవుడ్ స్టార్స్ పై కేసు!

ఇవాళ రేపు సోషల్ మీడియాతో ఎంత స్ట్రాంగ్ ఎదిగిందోగాప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వెళ్లలేని చోటుకి కూడా సోషల్ మీడియా వెళ్తు, క్షణాల్లో సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తుంది. ఎంటర్టైన్మెంట్ నుంచి మొదలు పెడితే ఏది కావాలన్న కూడా సోషల్ మీడియాలో దాని గురించిన న్యూస్ ఉంటుంది.

ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో, ఏ న్యూస్ లేనప్పుడు ఏదో ఒక గాసిప్ తో బిజీ గా ఉండే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇటీవలనే ముంబై లో జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల, సోషల్ మీడియా కారణంగా ఏకంగా బాలీవుడ్ లో ఇద్దరు బడా స్టార్స్ పై పోలీసులు కేస్ నమోదు చేసేదాకా వెళ్ళింది.

ఇక విషయానికొస్తే బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటి అనుష్క శర్మ లపై ఈ సోషల్ మీడియా కారణంగా పోలీస్ కేసులు నమోదు చేసారు. ఎందుకు? ఎలా? అని అనుకుంటున్నారా?

- Advertisement -

అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ పని మీద ఒక లొకేషన్ చేరుకోవాల్సి ఉండింది. కానీ ముంబై లో ట్రాఫిక్ కారణంగా ఆయన తన కార్ తో స్ట్రక్ అయిపోయారు. ఎలాగైనా ఆన్ టైం కి లొకేషన్ కి చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో కార్ నుండి దిగి, అక్కడ తనకి కనిపించిన ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి లొకేషన్ కి చేరుకున్నారు.

అయితే అయన ట్విట్టర్ ద్వారా ముంబై లో ఉన్న ట్రాఫిక్ జామ్ ప్రాబ్లెమ్ నుంచి తప్పించి సమయానికి తనని లొకేషన్ కి చేర్చినందుకు ఆ బైక్ రైడర్ కి థాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అలాగే అనుష్క శర్మ కూడా ఓ సందర్భంలో బైక్ ఎక్కాల్సి వచ్చింది.

ఇలా వీళ్ళు బైక్ పై హెల్మెట్ లేకుండా వెళ్లడం గమనించిన ముంబై యువత ఫోటోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అవడంతో కొంత మంది వీళ్లా సింప్లీసిటీ కి మెచ్చుకోగా, మరి కొందరు.. అమితాబ్, అనుష్క హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు ? సెలెబ్రెటీలు ఐతే మాత్రం రూల్స్ పాటించనవసరం లేదా? అని అనూహ్యరీతిలో కామెంట్స్ చేసారు. వాళ్లపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ ముంబై పోలీసులని ట్యాగ్ చేయడంతో అనుష్క, అమితాబ్ బచ్చన్ లపై ముంబై పోలీస్ లు కేసు నమోదు చేసారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు