Gaanja Shankar: ఆగిపోయిన సినిమాకు నోటీసులు

ఏమైంది ఈవేళ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా
ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది. ఆ సినిమా కమర్షియల్ గా థియేటర్ వద్ద పెద్దగా హిట్ కాకపోయినా కూడా చాలామందికి ఆ సినిమా ఇప్పటికీ ఇష్టం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సినిమాను సంపత్ నంది డీల్ చేసిన విధానం అంతా బాగుంటుంది. ఆ సినిమా తర్వాత సంపత్ నంది చేసిన సినిమా రచ్చ.

రామ్ చరణ్ హీరోగా చేసిన రచ్చ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రచ్చ సినిమాలో చిరంజీవి మేనరిజమ్స్ ను కూడా అక్కడక్కడ కనిపించేలా డిజైన్ చేశాడు సంపత్ నంది. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుని మంచి అనుభూతిని ఇచ్చింది. అయితే సంపత్ నంది ఎన్ని సినిమాలు చేసినా కూడా కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అంటూ మాట్లాడితే రచ్చ అని చాలామంది చెబుతూ ఉంటారు.

సంపత్ నంది చేసిన బెంగాల్ టైగర్, సీటిమార్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్నాయి. ప్రస్తుతం సంపత్ నంది చేస్తున్న సినిమా గాంజాశంకర్. సాయి ధరంతేజ్ హీరోగా ఈ సినిమాను ఇదివరకే అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా ఆగిపోయిందని కొంతమేరకు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా మరోసారి చర్చలోకి వచ్చింది.

- Advertisement -

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పై ఒక వివాదం నెలకొంది. తెలంగాణ యాంటి నార్కోటిక్ బ్యూరో ఆఫీస్ ఈ సినిమా టైటిల్, ఈ సినిమా టీజర్ ను కొట్ చేస్తూ, డ్రగ్సును తీసుకోవటానికి ప్రేరేపిస్తున్నట్లు ఈ సినిమా టీజర్ ఉందని వారి వాదనను వినిపిస్తున్నారు. చిత్ర యూనిట్ కి యాంటి నార్కోటిక్ బ్యూరో ఆఫీస్ ఇప్పటికే నోటీసులు పంపించింది. ఆగిపోయిన సినిమాకి నోటీసులు ఏంటి అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు