Kantara2: షూటింగ్ కి రెడీ అవుతున్న మరో పాన్ ఇండియా సినిమా..!

కన్నడ దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో గత ఏడాది వచ్చిన కాంతార సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉండబోతుందని గతంలోనే అనౌన్స్ చేసిన రిషబ్ శెట్టి అందుకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసాడని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ ని ఆగస్టు 27 నుండి ప్రారంభించనున్నారని హోమబుల్ ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో వర్షాకాలంలో తీయాల్సిన సన్నివేశాలు ఉంటాయని, అందుకోసమే ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.
ఫస్ట్ పార్ట్ లో బడ్జెట్ సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో సెకండ్ పార్ట్ కి బడ్జెట్ పెంచి కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించారట. మార్చ్ లో స్టార్ట్ చేసిన స్క్రిప్ట్ వర్క్ ఇటీవలే పూర్తైన నేపథ్యంలో ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి 2024కి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట రిషబ్ శెట్టి.
కేజిఎఫ్, కాంతార సినిమాల తర్వాత కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి. తక్కువ బడ్జెట్ తోనే మంచి క్వాలిటీ విజువల్స్ రాబట్టినందుకు రిషబ్ శెట్టి కి విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ నేపథ్యంలో కాంతారా2 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ పార్ట్ కి ప్రీక్వెల్ గా రానున్న ఈ సినిమాకు విజువల్స్, కథ కీలకంగా ఉండనున్నాయి. మరి, చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కాంతారకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు