Mangalavaaram : చాలా గ్యాప్ తర్వాత ఆ డైరెక్టర్ నుండి మళ్ళీ సినిమా?

“RX100” సినిమా తో టాలీవుడ్ లో కెరటం లా దూసుకొచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. 2018 లో వచ్చిన ఆ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టాలీవుడ్ మొత్తం తనవైపు చూసేలా చేసాడు. ఆ తర్వాత “మహా సముద్రం” అంటూ శర్వానంద్, సిద్ధార్థ్ ను హీరోలుగా పెట్టి సినిమా తీసాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఇప్పుడు మరో డిఫెరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ముగ్ద మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో స్వాతి గుణుపతి, సురేష్ వర్మ కలిసి నిర్మించబోతున్న సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా పేరే “మంగళ వారం”. వినడానికి టైటిల్ క్యాచీ గా ఉన్నా కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇంకా నటీనటుల కి సంబంధించిన విషయాలను రివీల్ చేయలేదు గాని, ఈ సినిమా యొక్క టీజర్ అప్డేట్ ని జూన్ 30న తెలియ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

తాజాగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో “ఫియర్ ఇన్ ఐస్” ఆన్ టీజర్ అంటూ కాప్షన్ పెట్టి వదిలారు. దీన్ని బట్టి టీజర్ సరికొత్తగా ఉండబోతుందని అనిపిస్తుంది. ఇక రెండేళ్ల విరామం తర్వాత అజయ్ భూపతి నుండి వస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ ఇవ్వలేదు. రేపు ఇచ్చే టీజర్ అప్డేట్ తో తెలియపరుస్తారేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు