Rudrangi: పదేళ్ల గ్యాప్ ఇచ్చినా తెలుగులో అదరగొట్టిన మమతా!

తెలంగాణా గడీ దొరల నేపథ్యంలో వస్తున్న తాజా చిత్రం “రుద్రంగి”. ఈ సినిమాలో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించగా ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, గణవి లక్ష్మణ్, విమలారామన్ ముఖ్య పాత్రల్లో నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బాలకృష్ణ ముఖ్య అతిధిగా ఘనంగా జరిగింది.

అయితే ఈ సినిమాలో ఫీమెల్ లీడ్ లో నటించిన మమతా మోహన్ దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎందుకంటే ఒకప్పుడు వరుసబెట్టి తెలుగు సినిమాలు చేసిన ఈ భామ కొన్నాళ్ళు సినిమాలు మానేసింది. అప్పట్లో తన కొచ్చిన క్యాన్సర్ జబ్బు కారణంగా గ్యాప్ ఇవ్వగా, త్వరగా కోలుకొని కేవలం మలయాళం లో మాత్రమే సినిమాలు చేసింది. చివరగా నాగార్జున కేడి సినిమాలో నటించిన మమతా, ఇప్పుడు దాదాపు పదమూడేళ్ల గ్యాప్ తరువాత రుద్రంగి సినిమాలో నటించింది.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మమతా తెలుగులో మాట్లాడి అదరగొట్టడం విశేషం. తడబడుతూ అయినా పదేళ్ళ గ్యాప్ తర్వాత ఇంత చక్కని తెలుగు మాట్లాడటం మమత కె చెల్లింది. ఈమె వచ్చిన టైమ్ లోనే వచ్చిన కాజల్, తమన్నా లాంటి హీరోయిన్లు ఇప్పటికి తెలుగు మాట్లాడలేరు. కానీ మమతా మాత్రం తన తెలుగు మాటలతో అందర్ని ఆశ్యర్యానికి గురి చేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అందరికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తూ ఈ రోల్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ సామ్రాట్ కి కృతజ్ఞతలు చెప్పింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెన్ కి వచ్చినందుకు బాలకృష్ణ కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది.

- Advertisement -

ఇక ఫైనల్ గా ఈ మూవీ చేయడానికి ప్రధాన కారణం జగపతి బాబు తో ఉన్న ఫ్రెండ్షిప్ ఏ కారణం అని అంది. ఇన్ని రోజులు తెలుగు ఆడియన్స్ ని చాలా మిస్ అయ్యాను అని చెప్పింది. ఇక రుద్రంగి సినిమా జులై7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందన్న సంగతి తెలిసిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు