రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దేవి శ్రీ పాటలకు ప్రేక్షకుల్లో పిచ్చా క్రేజ్ ఉంది. దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడంటే ఆ సినిమా సక్సెస్ కావడంలో మ్యూజిక్ మ్యాజిక్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక “పుష్ప” మూవీతో జాతీయ అవార్డును అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ కు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అది కూడా బడాబడా ప్రాజెక్టులే కావడం విశేషం. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో దాదాపు అరడజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా దేవిశ్రీ సాలిడ్ లైనప్ పై ఓ లుక్కేద్దాం.
దేవిశ్రీ మాస్ లైనప్…
నిన్న మొన్నటి వరకు దేవి శ్రీ ప్రసాద్ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య రెండు రెట్లు రెట్టింపు అయ్యింది. మరో మూడు నాలుగు పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసే అవకాశం దక్కింది రాక్ స్టార్ కు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప 2″కు దేవిశ్రీనే సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ కు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీతో పాటు సూర్య హీరోగా నటిస్తున్న “కంగువ”కి కూడా దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత దేవిశ్రీ ఖాతాలో అక్కినేని నాగ చైతన్య కొత్త చిత్రం “తండేల్” ఉంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అలాగే ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ “కుబేర”కు మ్యూజిక్ అందించే ఛాన్స్ కూడా దేవిశ్రీకే దక్కింది. శేఖర్ కమ్ముల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ ఉండగా, తాజాగా అజిత్ నెక్స్ట్ మూవీ కూడా చేరిపోయింది. దేవిశ్రీ లైనప్ లో అజిత్ నెక్స్ట్ భారీ బడ్జెట్ మూవీ “గుడ్ బ్యాడ్ అగ్లీ” వచ్చి పడింది. ఇక్కడితో ఆగలేదు ఈ స్టార్ డైరెక్టర్ మాస్ లైనప్. కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా నటిస్తున్న “రత్నం”కు సంగీతం అందించాల్సిన బాధ్యత కూడా డిఎస్పి పైనే ఉంది. అలాగే రామ్ చరణ్ 17వ మూవీకి దేవిశ్రీ సంగీతం అందిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించనున్నారు. ఇదన్న మాట రాక్ స్టార్ షాకింగ్ సాలిడ్ లైనప్.
కష్టాల నుంచి దేవిశ్రీ గట్టెక్కినట్టేనా?
కొన్ని ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. అయితే రీసెంట్ టైమ్స్ లో తమన్, అనిరుధ్ వంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కు క్రేజ్ పెరగడంతో దేవిశ్రీకి గడ్డుకాలం మొదలైంది. ఒకానొక సమయంలో అవకాశాలు లేక ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చింది. తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేసే డిఎస్పి ఏడాదికి ఒక్క సినిమా కూడా చేసే అవకాశాన్ని దక్కించుకోలేకపోయారు. చివరగా “వాల్తేర్ వీరయ్య” మూవీకి మ్యూజిక్ అందించిన డిఎస్పీకి మళ్లీ అవకాశాలు వరదలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా ఆయన నుంచి గతంలో లాగా చార్ట్ బస్టర్ సాంగ్స్ ను ఆశిస్తున్నారు సంగీత ప్రియులు. అలాగే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని డిఎస్పి తిరిగి ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న అవకాశాలతో మరో రెండు మూడేళ్లు ఫుల్ బిజీగా ఉంటారు దేవిశ్రీ. మరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు దేవిశ్రీ ఎలాంటి సంగీతం అందిస్తాడో చూడాలి.
Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.