Ponniyin Selvan2: లెజెండ్స్ తో కలిసి సినిమా చుసిన DSP

పొన్నియన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపెడుతూనే ఉంది. ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమా గా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకున్నా ఓపెనింగ్స్ తో అదరగొట్టింది. PS 2 విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 150 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి 200 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా 172 కోట్ల బిజినెస్ చేయగా 77 కోట్ల షేర్ ని మూడు రోజుల్లోనే వసూలు చేసింది. పొన్నియన్ సెల్వన్ లో విక్రమ్, కార్తీ, జయం రవి హీరోలుగా నటించగా ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ హీరోయిన్లు గా నటించారు. ప్రభు, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, పార్తీబన్, ఐశ్వర్యలక్ష్మి, జయరాం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ను రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తనకిష్టమైన ఇద్దరు లెజెండరీ వ్యక్తులతో కలిసి వీక్షించాడు. వారిలో ఒకరు లోకనాయకుడు కమల్ హాసన్, ఇంకొకరు ఈ సినిమా తీసిన దర్శకుడు మణిరత్నం. వీళ్ళతో కలిసి మే 1 న PS 2 చూడడం జరిగింది. ఈ విషయాన్నీ దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం మ్యూజిక్ సిట్టింగ్ లో ఉన్న డీఎస్పి తర్వాత పుష్ప2 ట్యూన్స్ కూడా రెడీ చేస్తున్నాడు.

పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని మణిరత్నం స్వీయ నిర్మాణం లో తెరకెక్కించగా ఏ.ఆర్ రహ్మాన్ ఈ సినిమా కు సంగీతం అందించాడు. ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్లు 150 కోట్ల గ్రాస్ దాటగా రానున్న రోజుల్లో మరెంత వసూలు చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు