Anasuya : నాదంతా ట్విట్టర్ లోనే..

ఈ మధ్య కాలంలో యాంకర్ అనసూయ బయట కనిపించక చాలా రోజులే అవుతోంది. బుల్లితెరకు సైతం ఆమె దూరంగానే ఉంది. ఈటీవీని వదిలి స్టార్ మా కి వెళ్లిన విషయం తెలిసిందే. స్టార్ మాలో సింగింగ్ షో చేసింది. ఆ షో అయిపోయింది. ఇప్పుడు ఏ షోలు లేక బుల్లితెరకు దూరంగా ఉంటుంది. తాజాగా అనసూయ ఓ ఈవెంట్ లో కనిపించింది. తాజాగా మాయాపేటిక సినిమా ఈవెంట్ కోసం అనసూయ వచ్చింది. అనసూయ రావడానికి ఓ కారణముంది. 

అనసూయ కరోనా సమయంలో చేసిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమా నిర్మాతలు ‘మాయా పేటిక’ సినిమాను తెరకెక్కించారు.  జ‌స్ట్ ఆర్టిన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ర‌మేష్ రాపార్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అనసూయ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఈవెంట్ లో అనసూయ సందడి చేసింది. అనసూయ ఈ సినిమా గురించి మాట్లాడింది. జస్ట్ ఆర్డినరీ బ్యానర్ అంటే నాకు ఫ్యామిలీ లాంటిది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుంది. నేను ఈ సినిమాలో లేకున్నా చెబుతాన్నంటే అర్థం చేసుకోండి. నన్ను అందరూ చాలా సెల్ఫీష్ అని అందరూ అంటుంటారు. కానీ నేను లేకున్నా ఈ సినిమా బాగుందని చెబుతున్నానంటే అర్థం చేసుకోవాలి. 

- Advertisement -

మాయా పేటిక కాబట్టి.. అందరి మొబైల్ ఫోన్ సీక్రెట్ల గురించి హోస్ట్ గా ఉన్న యాంకర్ రవి అడిగాడు. కానీ అనసూయను మాత్రం అడగలేదు. ఇదే విషయాన్ని అనసూయ స్టేజ్ మీద అడిగింది. “అందరినీ అడిగావ్.. నన్ను మాత్రం ఎందుకు అడుగలేదు” అని నిలదీసింది అనసూయ. అడుగుదాం  అనుకున్నా.. ఎన్నెన్నో ప్రశ్నలుండే..? కానీ మరిచిపోయాను.. ఎందుకొచ్చిన గొడవ అంటూ రవి సైలెంట్ అయిపోయాడు. నాదంతా ట్విట్టర్ లోనే ఉంటుందన్నట్టుగా అనసూయ తన కాంట్రవర్సిల మీద తానే కౌంటర్ వేసుకుంది. మొత్తానికి అనసూయ మాయా పేటిక ఈవెంట్ లో సందడి చేసి.. సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు