Allu arjun : బాలీవుడ్ కి నో చెప్పిన పుష్పరాజ్

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2021 లో రిలీజై మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

గతంలో సుకుమార్ అల్లు అర్జున్ కలిసి చేసిన ఆర్య సినిమా సూపర్ హిట్ అవడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత వీళ్ళు ఆర్య 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆర్య 2 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఇక ఆ తరువాత ఫ్యాన్స్ నుంచి ఆర్య3 సినిమా చేయాలనీ డిమాండ్ రావడంతో సుకుమార్ ఫ్యాన్స్ కి ఆర్య3 కాదు గాని అంతకు మించి ఉండే సినిమాతో మళ్ళీ వస్తాం అని ఫ్యాన్స్ కి మాట ఇచ్చాడు. అన్నమాట ప్రకారం సుకుమార్ ఆర్య ని మించేలా బన్నీ కోసం పుష్ప సినిమా కథ రెడీ చేసారు.

మొదటగా సింగిల్ సినిమాగా అనుకున్న ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా రెండు పార్ట్ లుగా తీయ్యాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ కూడా టాలీవుడ్ వరకే అనుకోగా బన్నీకి ఇతర రాష్టాల్లో కూడా ఫ్యాన్స్ ఉండటంతో ఇండియా వైడ్ గా రిలీజ్ చేసారు. అయితే ఎవరు ఊహించని విధంగా సినిమా రిలీజైన వెంటనే అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో అల్లు అర్జున్ కి ప్రస్తుతం బాలీవుడ్ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే బన్నీ మాత్రం బాలీవుడ్ మేకర్స్ నో చెప్తున్నాడట. ఇటీవలనే అశ్వథామ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఒక బడా ప్రొడక్షన్ హౌస్ మూవీ ప్లాన్ చేయగా, హీరోగా బన్నీని అడిగారట..అయితే బన్నీకి బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి లేక స్మూత్ గా నో చెప్పాడట. బన్నీ ఫ్యాన్ కం జిఏ2 ప్రొడ్యూసర్ అయిన బన్నీవాసు అల్లు అర్జున్ రాబోయే సినిమాల గురించి చెబుతూ పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ లో సినిమా చేస్తాడని, ఇటీవలనే షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న జవాన్ సినిమాలో అల్లు అర్జున్ క్యామియో చేస్తున్నాడనే విషయంలో నిజం లేదని ఆయన చెప్పారు. అయితే సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ తో ఆ మధ్య కథ చర్చలు జరగగా, ఈ సినిమాపై ఎలాంటి వివరణ ఆయన ఇవ్వకపోవడం గమనార్హం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు