Satya: ఆల్ టైం ట్రెండ్ సెట్టర్ కి పాతికేళ్ళు – అప్పటి ఆర్జీవీ ఏమయ్యాడు..?

‘సత్య’ 1998 జులై 3న రిలీజ్ అయ్యి యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి సరిగ్గా పాతికేళ్ళు అవ్వటంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శివ సినిమా ద్వారా టాలీవుడ్లో సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సత్య సినిమాతో బాలీవుడ్ పై తనదైన ముద్ర వేశాడు.

జెడి చక్రవర్తి, ఊర్మిళ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. హీరో హీరోయిన్లతో పాటు మనోజ్ బాజ్ పేయ్, షిఫాలీ శర్మలకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా. ఇప్పటికి ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అప్పట్లో సత్య ఏ రేంజ్ లో  సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మలో అప్పటి డైరెక్టర్ ఏమయ్యాడు అంటూ నెటిజన్లు, సినీ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆర్జీవీ ప్రస్తుతం క్వాలిటీ లేని సినిమాలు చేస్తూ, రాజకీయ ప్రచారం కోసం ఒక పార్టీ తరఫున సినిమాలు తీసే స్టేజ్ కి రావటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

- Advertisement -

ఆర్జీవీ నుండి సత్య లాంటి సినిమా ఇప్పట్లో వస్తే చూడాలని ఉంది అంటూ కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ అభిమానుల కామెంట్స్ చూసి ఎలా స్పందిస్తాడు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆర్జీవీ తీస్తున్న సినిమాల సంగతి పక్కన పెడితే, అప్పట్లో శివ, రంగీలా, సత్య లాంటి సినిమాలతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన వర్మ మళ్లీ ఆ రేంజ్ సినిమా ఒక్కటైనా తీస్తాడా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు