Prabhas : సీతారామం కోసం ఆదిపురుష్

మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం సీతా రామం. కృష్ణ గాడి వీర ప్రేమ కథ, లై, పడి పడి లేచే మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన తెలుగు, మలయాళ, తమిళ భాషలలో విడుదల అవుతుంది. అందుకు ప్రమోషన్ పనులను కూడా చిత్ర బృందం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా రేపు సాయంత్రం 7 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నారు. ప్రభాస్ రాకపై ముందుగా అనుమానాలు ఉండేవి. కానీ, చివరిగా చిత్ర బృందం ప్రభాస్ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తున్నాడని అధికారికంగా ప్రకటించారు.

ప్రభాస్ వస్తుండటంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ, ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తూ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కువ మంది సమక్షంలో కాకుండా సాదాసీదాగా అతి కొద్ది మంది ప్రేక్షకుల మధ్య నిర్వహించాలని ప్రభాస్ తో పాటు చిత్ర బృందం నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే, ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు