Vijay : షేక్ చేస్తాం

టాలీవుడ్‌ పరిశ్రమలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ లైగర్ పై భారీ అంచనాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, ట్రైలర్, సాంగ్స్ పై ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్ లో విజయ్ కి మంచి ఎలివేషన్ ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెట్టాడట . ముఖ్యంగా మైక్ టైసన్ కి, విజయ్ కి మధ్య సీన్స్ చాలా బాగుంటాయని తెలుస్తుంది.

ఈ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటాయట. ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతోపాటు, హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్, కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ లైగర్ తో అది సాధ్యమవుతుంది.

ఇదిలా ఉండగా.. లైగర్ మూవీ యూనిట్ ప్రచారంను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ దేవరకొండ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర వాక్యాలు చేశాడు. లైగర్ సినిమా పక్కా తెలుగు అని చెప్పాడు. తెలుగు కథను హిందీ ప్రేక్షకులకు చెప్పబోతున్నట్టు వివరించాడు. అలాగే కెరీర్ బిగినింగ్ లో పూరి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేద్దామని అనుకున్నట్టు తెలిపాడు. కానీ, ఇప్పుడు పూరీ దర్శకత్వంలోనే సినిమా చేసే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో తప్పకుండా ఇండియాను షేక్ చేస్తామని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు