Mammootty:ఆ రోజు నుండి యాత్ర2 పనులు మొదలు..

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ లో ఎన్నికల హడావిడి ముగియగా, త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్నికల సమరం మొదలుకానుంది. అయితే ఈ ఎన్నికల వేడి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మధ్య మరింత పెరుగుతుంది. ఎవరికీ వారు ఎలా వీలైతే అలా, ప్రచారాలు చేస్తుండగా, కొందరు రాజకీయ నేతలు సినిమాల నుండి కూడా ప్రచారాలు చేద్దామని చూస్తున్నారు. ఇక ఈ లేటెస్ట్ గా వైయెస్సార్ బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర సినిమాకి సీక్వెల్ గా యాత్ర 2 కూడా వస్తుందన్న సంగతి తెలిసిందే.

వైస్సార్ గా మమ్ముట్టి నటించగా, ఈ సీక్వెల్ లో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గా తమిళ నటుడు జీవా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తయి చాలా రోజులే అయినా సరైన రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఎదురుచూసారు. ఇక డైరెక్టర్ మహివి రాఘవ లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ తో సహా టీజర్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు.

యాత్ర 2 మూవీ టీజర్ ని జనవరి 5న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించగా, మూవీ ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేసారు. ఇక అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వైస్సార్ గా మమ్ముట్టి, జగన్ గా జీవా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా, వైయస్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇక యాత్ర 2నే కాకుండా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం కూడా ఎన్నికల నేపథ్యంలో జగన్ బయోపిక్ గా తెరకెక్కగా త్వరలోనే ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు