Varalakshmi: వరలక్ష్మి పై మోజు పడ్డ టాలీవుడ్ దర్శకుడు ?

Varalakshmi

కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్.. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే లేడీ విలన్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ చాలా సినిమాలు చేసి… లేడీ విలన్ గా మంచి పేరు దక్కించుకున్నారు. పెద్దపెద్ద సినిమాలలో లేడీ విలన్ రోల్స్ తో మెప్పించి అందరి మన్ననలు పొందుతున్నారు వరలక్ష్మి.

ఇక ఇటీవల బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమాలో.. చెల్లెలి పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. అలాగే ఈ సినిమాలో విలన్ గా కూడా నటించింది. ఇది ఇలా ఉండగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు వరలక్ష్మి శరత్ కుమార్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన రెండు సినిమాలలో విలన్ గానే నటించింది.

ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ను అస్సలు వదలకూడదని.. ఆమెకు మరో సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. త్వరలోనే రవితేజ (Raviteja) తో గోపీచంద్ మరో సినిమా చేయనున్నారు. ఇందులో ఓ కీలకపాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట గోపీచంద్ మలినేని.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు