Varalakshmi Sarath Kumar: ఆ.. బాధ నుంచి తేరుకోలేదా.?

వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఇప్పుడు తెలియని వారు ఉండరు.
తొలుత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి, ప్రస్తుతం విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకుంది. విశాల్ నటించిన పందెం కోడి 2 సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా అందులో వరలక్ష్మీ చేసిన నెగెటివ్‌ క్యారెక్టర్‌ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.

తెలుగులో గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర వరలక్ష్మి కి వరుస అవకాశాలను తీసుకొచ్చి పెట్టింది.
రీసెంట్ గా వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాలో కూడా ఒక కీలక పాత్రను పోషించింది వరలక్ష్మి. విలన్ రోల్స్ తో పాటు నాంది, పక్కా కమర్షియల్‌, మైఖేల్‌ తదితర సినిమాల్లో కీలక పాత్రలను పోషించింది. ప్రస్తుతం ఆమె చేతిలో హనుమాన్‌, శబరితో పాటు చాలా సినిమాలు ఉన్నాయి.

37 ఏళ్ళు ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
బోలెడు మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్న ఇండస్ట్రీ లో ఇలా పెళ్లి చేసుకోకపోవడం పెద్ద విషయం కాదు. గతంలో వరలక్ష్మి మరియు విశాల్ మధ్య ప్రేమాయణం నడిచింది అని పలు కథనాలు కోడై కూశాయి. వరలక్ష్మి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇంకా ఆ బాధ నుంచి తేరుకోలేదని అక్కడక్కడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి గతంలో విశాల్ ఈ విషయంపై స్పందిస్తూ వరలక్ష్మి తన స్కూల్ నుంచి ఫ్రెండ్ అని ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు రావడం సహజం అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా తనపని తాను చేసుకుంటూ సినిమాల్లో ఫుల్ బిజీగా అయిపోయింది వరలక్ష్మి. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ కి Filmify.in తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు