Urvashi Rautela: బ్రదర్స్ తో స్పెషల్ సాంగ్ చేయడం తన అదృష్టమంటున్న బాలీవుడ్ భామ!

Urvashi Rautela talk about megabrothers:

టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న బాలీవుడ్ భామ “ఊర్వశి రౌటేలా“. సినిమా ఛాన్సులు రాకపోయినా, స్పెషల్ సాంగ్స్ లో మాత్రం వరుసగా ఆఫర్లు పొందుతుంది. వాల్తేరు వీరయ్య తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తర్వాత ఏజెంట్ లోను స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” సినిమాలో కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేసింది. మై డియర్ మార్కండేయ అనే పేరుతో వచ్చే ఈ పాటలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ తోను చిందేసింది.

ఇక “బ్రో” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చిన ఈ భామ అక్కడ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం అందులోనూ హీరోలిద్దరితోను డాన్స్ చేయడం బాగా నచ్చిందని అంది. ఇక మెగాస్టార్ చిరంజీవితోను, పవన్ కళ్యాణ్ ఇద్దరితోను కెరీర్ బిగినింగ్ లోనే సాంగ్స్ చేయడం తన అదృష్టమని ఊర్వశి రౌటేలా చెప్పింది. ఇక ఫైనల్ గా ఒక డాన్స్ స్టెప్ వేయమని యాంకర్ కోరగా స్టేజి మీద చేస్తానని బదులిచ్చింది. కానీ పవర్ స్టార్ ముందే చేయాలనీ అక్కడ కూడా చేసే అవకాశం రాలేదు.

ఇక 2023 లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌటేలా ఒకే ఇయర్ లో మూడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. ఈ సినిమా తర్వాత ఊర్వశి మరిన్ని ఛాన్సులు అందుకోవడం ఖాయంగా అనిపిస్తుంది. ఇక తన అదృష్టం బాగుంటే హీరోయిన్ గా కూడా టాలీవుడ్ లో ఆఫర్లు అందుకునే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు