Trivikram : పాత స్ట్రాటజీని కొత్తగా..

టాలీవుడ్ స్టార్ దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. డైలాగ్ రైటర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ ట్యాగ్ సంపాదించుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమకు త్రివిక్రమ్ ఎన్నో హిట్ సినిమాలను ఇచ్చాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 8 నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. మొదటి షెడ్యూల్ లో సూపర్ స్టార్ పై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తారని టాక్. కేజీఎఫ్ ఫేమ్ ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివుల ఆధ్వర్యంలో మహేష్ బాబు యాక్షన్ సీన్స్ లో పాల్గొననున్నాడు.

అలాగే అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్ తొలి వారంలో గానీ రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. రెండో షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే సెట్స్ పైకి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే మొదట యాక్షన్స్ ను షూట్ చేసిన తర్వాత కామెడీ, లవ్ ట్రాక్ పైనే త్రివిక్రమ్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తుంది. కాగా త్రివిక్రమ్ గతంలో తారక్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా టైంలో కేడా త్రివిక్రమ్ ఈ స్ట్రాటజీనే ఫాలో అయ్యాడు. ఇప్పుడు మహేష్ కోసం మళ్లీ పాత పద్దతినే కొత్తగా చేయనున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

కాగా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ‘అతడు’, ‘ఖలేజ’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు