Heroines: ఓకే బ్యానర్ లో రిపీట్ అవుతున్న హీరోయిన్స్ వీళ్ళే.. !

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకి బంపర్ ఆఫర్లు వస్తున్నాయని చెప్పాలి. ఒక ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ మరో మూడు , నాలుగు సినిమాలకు అదే బ్యానర్లో సైన్ చేస్తూ.. ఆ బ్యానర్లకి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే ట్రెండు నడుస్తోంది. ఒక సినిమాలో నటించడానికి వచ్చిన హీరోయిన్ కి మరో ఒకటో రెండో అవకాశాలు కచ్చితంగా ఇస్తున్నారు సదరు సినిమా మేకర్స్.. మరి అలా ఏకులా వచ్చి మేకులా దిగిపోయిన ఆ స్టార్ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

శ్రీ లీల..
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చిన ఆదికేశవ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.. అంతేకాదు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం ఇదే బ్యానర్లో మరోసారి నటించింది ఈ ముద్దుగుమ్మ.

మీనాక్షి చౌదరి..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో రెండవ హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరి మళ్ళీ అదే సితార బ్యానర్ లో లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా అవకాశం లభించింది.. అంతేకాదు వరుణ్ తేజ్ మట్కా సినిమాలో మీనాక్షి చౌదరి ఇప్పటికే నటిస్తూ ఉండగా.. ఈ సినిమా నిర్మిస్తున్న బ్యానర్ లోనే విశ్వక్ సేన్ తో మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.

- Advertisement -

నేహా శెట్టి..
సితార బ్యానర్లో మొదట డీ జే.టిల్లు అనే చిత్రంలో నటించిన ఈమె.. ఇప్పుడు ఇదే బ్యానర్ లో వస్తున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.

అనుపమ పరమేశ్వరన్..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ -2లో హీరోయిన్ గా నటించిన అనుపమ.. ఆ తర్వాత ఇదే బ్యానర్ లో ఈగల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అ ఆ , ప్రేమమ్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమె.. ఇప్పుడు ఇదే బ్యానర్ లో వస్తున్న టిల్లు స్క్వేర్ లో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.

రష్మిక:
రష్మిక మొదట దిల్ రాజు బ్యానర్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది.. ఆ తర్వాత అదే బ్యానర్ లో వారసుడు సినిమాలో కూడా నటించింది. మరొకవైపు మైత్రి మూవీస్ బ్యానర్ లో డియర్ కామ్రేడ్ సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత పుష్ప, పుష్ప 2 సినిమాలో కూడా అదే బ్యానర్ లో నటించింది.

సంయుక్త మీనన్..
సితార బ్యానర్లో సారొచ్చారు, భీమ్లా నాయక్ వంటి సినిమాలలో నటించింది సంయుక్తా మీనన్..

కియారా అద్వానీ..
డివివి బ్యానర్స్ లో భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి రెండు చిత్రాలలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది.. మరొకవైపు ఇదే బ్యానర్లో ప్రియాంక మోహన్ కూడా మొదట గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి ఆ తర్వాత సరిపోదా శనివారం, OG చిత్రాలలో నటిస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు