రానా, సాయిపల్లవి జంటగా ఇటీవల వచ్చిన సినిమా విరాట పర్వం. ఎప్పుడో రావాల్సిన ఈ విరాట పర్వం మూవీ కరోనా, లాక్ డౌన్ తదితర కారణాల వల్లన వాయిదా పడుతూ వచ్చింది. గత నెల 17న థియేటర్లలో విడుదల కాగా, ఈ మధ్యనే ఓటీటీ లో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా వేణు ఉడుగుల తెరకెక్కించారు. నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఉడుగుల, విరాట పర్వం సినిమాను చాలా చక్కగా తీశారు. సామాన్యుడికి అర్థం అయ్యేలా, మాస్ డైలాగులతో తీశారు వేణు.
ఈ సినిమా కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకోకపోయినా, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను మాత్రం దక్కించుకుంది. ఇక ఇప్పుడు వేణు ఉడుగుల మరో కథను సిద్ధం చేస్తున్నారట. ఈసారి పొలిటీకల్ బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ మూవీని తీయాలని స్కెచ్ వేశారట దర్శకుడు వేణు ఉడుగుల. ఓ స్టార్ హీరో కూడా ఈ సినిమాకు ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే పవన్ తో వేణు ఉడుగుల సినిమా చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలపై వేణు ఉడుగుల ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అయితే, విరాట పర్వం రిలీజ్ అయిన తర్వాత, సినిమా బాగుందని వేణు ఉడుగులను త్రివిక్రమ్ ప్రశంసించారట. ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ, వేణు ఉడుగులను పొగిడారట మాటల మాంత్రికుడు. అంటే ఈ లెక్కన త్రివిక్రమ్ తో మాట్లాడితే, పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చినట్లేనని కొంత మంది అంటున్నారు. దీంతో వేణు ఉడుగుల తర్వాత వచ్చే రాజకీయ నేపథ్యం గల సినిమా పవన్ తో అని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో పవన్ హీరో కాదని, ఒక యంగ్ హీరోతో వేణు వేడుగుల సినిమా చేస్తున్నారని అంటున్నారు. కానీ, త్వరలోనే పవన్-వేణు ఉడుగుల కాంబో రాబోతుందని టాక్.