SSMB 29: బాలీవుడ్ స్టార్లతో నింపుతున్న జక్కన్న..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ఒక అడ్వెంచరస్ డ్రామా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ అభిమానులతో సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ క్రేజీయెస్ట్ కాంబినేషన్ కార్యరూపం దాల్చనున్న క్రమంలో సినిమా షూటింగ్ మొదలు కాకముందే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాజమౌళి ఈ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న ప్రారంభం కానున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఇప్పటికే సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి మరోక అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని, అంతే కాకుండా కీలక పాత్రల కోసం ముగ్గురు బాలీవుడ్ స్టార్ల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో RRR సినిమా ముందువరకు పెద్దగా బాలీవుడ్ నటుల జోలికి వెళ్లని జక్కన్న ఆ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్, అజయ్ దేవ్ గన్ లను తీసుకున్నాడు. ఇక RRR తర్వాత రాజమౌళి స్థాయి అంతర్జాతీయ స్థాయికి పెరిగిన సమయంలో మహేష్ బాబు సినిమాని చాలా గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావటంతో గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ గత చిత్రం సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో అలరించని క్రమంలో గుంటూరు కారం పైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు