Sridevi: శ్రీదేవి మీద ప్రేమతో ఆ దుబాయ్ షేక్ ఎంతకు తెగించాడో తెలుసా..?

Sridevi

అతిలోకసుందరి అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో తన అమాయకపు మాటలతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించింది శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీదేవి.. పదహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో స్టార్ హీరోలు అందరితోపాటు సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలలో ఎక్కువగా నటించింది శ్రీదేవి. ఈమె అన్ని భాషలలో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ బోనీ కపూర్ ని పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవి అంటే చాలామందికి ఇష్టం ఉండేది. కనీసం ఆమెతో మాట్లాడితే చాలని, కలిస్తే చాలని పడిగాపులు కాసినవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఓ దుబాయ్ షేక్ కూడా ఉన్నారు. ఆ దుబాయ్ షేక్ కనీసం ఒక్కసారి శ్రీదేవితో మాట్లాడితే చాలని ఎన్నో కలలు కనేవారట.

ఆ దుబాయ్ షేక్ ఓ రోజు ఏకంగా శ్రీదేవి ఇంటికి వెళ్లి ఆమె తల్లి రాజేశ్వరిని కలిసి శ్రీదేవితో మాట్లాడించమని అడిగారట. అప్పుడు శ్రీదేవి తల్లి చెన్నై నడిబొడ్డున ఉన్న సరస్వతి మహల్ తో పాటు నాలుగు వేల గజాల స్థలం కొని శ్రీదేవి పేరున పెట్టి డాక్యుమెంట్లు తెస్తే తన కూతురితో మాట్లాడిస్తానని చెప్పిందట. దీంతో ఆ దుబాయ్ షేక్ మరో మాట మాట్లాడకుండా 4 వేల గజాల స్థలంతో పాటు 100 కోట్ల విలువైన సరస్వతి మహల్ అనే ఓ ఇంటిని కొనేసి పేపర్స్ కూడా ఆమె చేతిలో పెట్టారట. అప్పుడు ఆమె శ్రీదేవితో ఆ దుబాయ్ షేక్ ను మాట్లాడమని చెప్పిందట. అంటే శ్రీదేవి పట్ల ప్రేక్షకులు ఎంత వెర్రి అభిమానంతో ఉండేవారో చెప్పేందుకు ఈ సంఘటన పెద్ద ఉదాహరణగా అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు