యాక్షన్ కింగ్, సీనియర్ నటుడు అర్జున్ దర్శకుడిగా అతని కూతురు ఐశ్వర్య హీరోయిన్గా విశ్వక్ సేన్ కథానాయకుడిగా ఒక చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఆ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్తో భారీగానే ప్రారంభించారు. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైన తరువాత విశ్వక్ సేన్ ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ విషయం పై ఇటీవల అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఫిల్మ్ ఛాంబర్ లో విశ్వక్ సేన్ పై ఫిర్యాదు చేస్తానని చెప్పి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆ సినిమాలో కొత్త హీరో గురించి సెర్చింగ్ చేయడం ప్రారంభించారు. ఇక ఇంతలోనే అర్జున్ కన్ను యంగ్ హీరో శర్వానంద్ పై పడినట్టు సమాచారం. శర్వానంద్కి అయితేనే ఈ కథ కరెక్ట్ సెట్ అవుతుందని భావిస్తున్నాడట. త్వరలో శర్వానంద్ని కలిసి ఈ కథను వినిపించి, అంతా ఓకే అనుకున్న తరువాత ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమాని ఒప్పుకున్నాడు. శ్రీరామ్ ఆదిత్య కూడా ఈ యంగ్ హీరోకి ఓ కథ వినిపించినట్టు టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో అర్జున్ సినిమాను శర్వానంద్ ఒకే చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా అర్జున్ తన సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించానలి ప్లాన్ వేసుకుంటున్నాడు. ఒకవేళ శర్వానంద్ అర్జున్ సినిమాని ఒప్పుకుంటే మాత్రం మిగిలిన సినిమాలను పక్కన పెట్టే పరిస్థితి ఎదురవుతుంది. శర్వానంద్ ఈ సినిమాకి ఓకే అంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.