Sapta Saagaraalu Daati : రక్షిత్ శెట్టి మూవీ మిస్సింగ్? ఏం జరుగుతోంది అసలు?

కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “సప్తసాగరాలు దాటి” మూవీ రెండు భాగాలుగా థియేటర్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు, కన్నడ భాషల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ మూవీ సడన్ గా ఓటిటీ నుంచి మాయమయ్యి షాక్ ఇచ్చింది. ఇంతకీ సప్త సాగరాలు దాటి మూవీ విషయంలో ఏం జరుగుతోంది? ఎందుకు ఓటీటీ నుంచి సడన్ గా మాయమైంది? అనే వివరాల్లోకి వెళ్తే…

సైడ్ బి మిస్సింగ్…

రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా నటించిన కన్నడ మూవీ సప్త సాగరాలు దాటి. ఈ మూవీ సైడ్ ఏ, సైడ్ బి అంటూ రెండు భాగాలుగా వచ్చింది. హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ లవ్ ఎమోషనల్ డ్రామా తెలుగులో కూడా రిలీజ్ అయింది. చరణ్ రాజ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. కన్నడలో రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్ కాగా, తెలుగులో మాత్రం కమర్షియల్ గా ఈ మూవీ సక్సెస్ కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. అయితే సప్త సాగరాలు దాటి మూవీ రెండు భాగాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సప్త సాగరాలు దాటి సైడ్ బి మూవీ జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటిటిలోకి అడుగు పెట్టింది ఈ మూవీ. అయితే తాజాగా ఉన్నట్టుండి ప్రైమ్ నుంచి సైడ్ బి మిస్ అయ్యింది. ప్రస్తుతం ఓటీటీలో కేవలం సప్త సాగరాలు దాటి సైడ్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది గమనించిన నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా సైడ్ బి ఎందుకు ఇలా ఉన్నట్టుండి మాయమైందని ప్రైమ్ వీడియోను ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

ఇదేనా రీజన్?
సప్త సాగరాలు దాటి మూవీ రెండు భాగాలకు కూడా రక్షిత్ శెట్టి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. వాస్తవానికి ఈ మూవీనీ ముందుగా పుష్కర్ అనే నిర్మాత నిర్మించారు. కానీ ఆ తర్వాత రక్షిత్ శెట్టి నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నారు. ముందు ఈ మూవీ ఒకే పార్ట్ ఉంటుందని అమెజాన్ ప్రైమ్ వీడియోకు స్ట్రీమింగ్ రైట్స్ ను ఇచ్చేశారు పుష్కర్. దీని ప్రకారమే సైడ్ ఏ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రిమింగ్ కు వచ్చింది. అయితే సైడ్ బి విషయంలో మాత్రం రక్షిత్ శెట్టి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సెకండ్ పార్ట్ ఓటిటి రైట్స్ ను కూడా ఆయన ప్రైమ్ వీడియోకే ఇచ్చేశారు. అయినప్పటికీ సడన్ గా ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన కొన్ని రోజులకే సప్త సాగరాలు దాటి సైడ్ బి మిస్ అవ్వడంతో వీళ్ళ డీల్ ఇదేనా అనే అనుమానం మొదలైంది. ఇక ఈ మూవీకి సంబంధించిన రెండు భాగాల సాటిలైట్ రైట్స్ ను జి నెట్వర్క్ దక్కించుకుంది. ఇప్పుడు సైడ్ బిని జి5 ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే ప్రైమ్ వీడియోలో సైడ్ బి మిస్ అయ్యిందని అంటున్నారు. దీంతో రక్షిత్ శెట్టి అభిమానులు ఈ మూవీ విషయంలో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు