ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవానే కనిపిస్తోంది. ఈ క్రిస్మస్ కానుకగా మరో పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమానే ప్రభాస్ హీరోగా నటించిన సలార్. ఈ సినిమాకు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరవాత ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా ఆయనకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా మరో ట్రైలర్ కూడా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతే కాకుండా మొదట విడుదల చేసిన ట్రైలర్ లో ప్రభాస్ పృథ్వీరాజ్ ఇద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులుగా కనిపిస్తారు. కానీ పెరిగి పెద్దవాళ్లు అయిన తరవాత మాత్రం ఇద్దరి మధ్య గొడవలు జరగటం కనిపిస్తుంది. దాంతో అసలు ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి..? అసలు పృథ్వీరాజ్ ఎందుకు ప్రభాస్ కు విరోధిగా మారాడు అన్న ప్రశ్న సినీ ప్రేక్షకుల్లో మొదలయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో సలార్ పై కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పృథ్వీరాజ్ మంచి స్నేహితులు కాగా ఇద్దరూ శృతి హాసన్ నే ప్రేమిస్తారట. దాంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయని టాక్. అలా మొదలైన గొడవలు పెద్దవి కావడంతో స్నేహితులు కాస్తా శత్రువులుగా మారిపోతారట. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అసలు కథ ఏంటో తెలియాలంటే సలార్ సినిమాను చూడాల్సిందే.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.