బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రభాస్తో ఒక సినిమా తెరకెక్కించాలంటే దాదాపు 100ల కోట్లు ఖర్చు చేయాల్సిందే. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలు కూడా ఇలాగే బిజినెస్ చేశాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ సినిమా విషయంలో బాహుబలి తరువాత భారీ బిజినెస్ జరిగిందనే చెప్పవచ్చు.
ప్రభాస్ ‘ఆది పురుష్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ. 500 కోట్లతో తెరకెక్కుతున్నట్టు ఇటీవలే నిర్మాత భూషన్ కుమార్ వెల్లడించారు. ఈ సినిమాని పాన్ వరల్డ్గా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇంగ్లీషు డబ్బింగ్ కోసం ఇంటర్నేషనల్ స్టూడియోస్ టై ఆఫ్ అవుతున్నారట. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు చిత్ర యూనిట్ స్పందించి టీజర్ కు సంబంధించి అప్డేట్ ట్వీట్ చేశారు.
ఈ సినిమా అక్టోబర్ 2 లేదా 3న టీజర్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను ఏక్షణమైన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్కి జోడిగా కృతిసనన్ సీత పాత్రలో నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 భాషల్లో విడుదల కానున్నట్టు సమాచారం.