7G Brundavan Colony: పీకే ఫ్యాన్స్ కి గాలమేసిన ఏ.ఎం రత్నం?

7G Brundavan Colony:

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఏ.ఎం రత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సౌత్ ఇండియా లోనే బడా హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన ఈ నిర్మాత, ఖుషి, భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ని అందించాడు. గత కొన్నేళ్లుగా తెలుగులో సినిమాలు తీయకున్నా, తమిళ్ లో మాత్రం మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసాడు. తెలుగులో చివరగా ఆరేళ్ళ కిందట గోపించంద్ హీరోగా ఆక్సిజన్ సినిమా నిర్మించిన ఈ ఏ. ఎం రత్నం ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు పేరిట భారీ పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నాడు.

అయితే తెలుగులో ఏ.ఎం రత్నం కి అందరికంటే ఎక్కువ క్లోజ్ బాండింగ్ పవన్ కళ్యాణ్ తోనే ఉంది. పీకే తో ఖుషి, బంగారం తీసిన ఈ నిర్మాత మళ్ళీ 15ఏళ్ళ తర్వాత హరిహర వీరమల్లు తీస్తున్నాడు. అందుకే ఈ నిర్మాత అంటే పీకే ఫ్యాన్స్ కూడా లైక్ చేస్తారు. ఆ చనువుతో ఏ. ఎం రత్నం పీకే ఫ్యాన్స్ కి గాలమేసినట్టున్నాడు. ఆ మధ్య ఖుషి సినిమా ని స్పెషల్ గా ప్రమోషన్ చేసి మరి రీ రిలీజ్ చేసాడు. ఖుషి రీ రిలీజ్ లో కూడా ఆల్ టైం రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ విధంగా రీ రిలీజ్ ద్వారా పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ తో రెండు మూడు కోట్లయినా వెనకేసుకున్నాడని చెప్పొచ్చు.

ఇప్పుడు మరోసారి పీకే ఫ్యాన్స్ సపోర్ట్ తో బృందావన్ కాలనీ రీ రిలీజ్ చేసాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అని కొందరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమాలో థియేటర్ కి వెళ్లి హీరోహీరోయిన్ ఎంజాయ్ చేసే సీన్ ఉంటుంది. అందులో ఖుషి రిలీజ్ కి వెళ్లినట్టు చూపిస్తారు. ఆ రకంగా పీకే ఫ్యాన్స్ సపోర్ట్ తో బృందావన్ కాలనీ తో కూడా రీ రిలీజ్ హిట్టు కొట్టేస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు