Pawan Kalyan:వీరమల్లు పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Pawan kalyan:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఆడియన్స్ లో ఎక్కువగా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పైనే దృష్టి పెడుతున్నా, ఫ్యాన్స్ మాత్రం హరిహర వీరమల్లు కూడా రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు. అయితే ఏ ముహూర్తాన సినిమా మొదలైందో కానీ నాలుగేళ్లుగా షూటింగ్ వాయిదా పడుతూ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాతే మొదలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజ్ కూడా అయిపోయాయి. కానీ పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు మాత్రం ఇంకా రిలీజ్ కి నోచుకోవడం లేదు.

ఇక ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో హరిహర వీరమల్లు షూటింగ్ వాయిదా పడింది. కానీ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మాత్రం రెగ్యులర్ షూట్ జరుపుకుంటున్నాయి. తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఏ ఎం రత్నం సినిమా షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. రూల్స్ రంజన్ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయనకి, ఓ విలేఖరి హరిహరవీరమల్లు సినిమా వాయిదా పై ప్రశ్నించగా అయన రిప్లై ఇచ్చాడు.

ప్రస్తుతం పవన్ ఎలక్షన్ల ప్రచారంలో ఉన్నాడు. అందులోను ఆయన తక్కువ రోజుల్లో ఫినిష్ అయ్యే సినిమాకే ఓటేస్తున్నాడు. కానీ వీరమల్లు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దాని షూటింగ్ కి ఎక్కువ సమయం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ రావడం కష్టం కాబట్టి, షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాము. కానీ 2023 చివరికల్లా ఎలాగైనా సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తామని ఏ ఎం రత్నం అన్నారు. అయితే ఆయన ఎదో మాట వరసకి లేన్నట్టు మాటల్లో తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం హరిహర వీరమల్లు మళ్ళీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ పై క్లారిటీ రావొచ్చని అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు