Simhadri: ఎన్టీఆర్ అభిమానుల ఆర్భాటమా – నిజంగా అంత సీనుందా..?

టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల సినిమాలు రీరిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేయగా ప్రస్తుతం తమ వంతు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సింహాద్రి సినిమాతో హడావిడి చేస్తున్నారు. అభిమానుల సందడి పక్కన పెడితే, రీరిలీజ్ సినిమాల కలెక్షన్స్ విషయంలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ తీవ్రం అయ్యాయి. ఇప్పటిదాకా రీరిలీజ్ అయిన సినిమాల్లో ఖుషి సినిమా 5కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి టాప్ ప్లేస్ లో ఉండగా, సింహాద్రి సినిమా తోలి రోజు 5.2కోట్లు రాబట్టి టాప్ ప్లేస్ లో నిలిచిందంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టారు.

అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సింహాద్రి తొలిరోజు కలెక్షన్స్ 4.2 కోట్లు తేలటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి. అంతే కాకుండా, ఆరెంజ్ సినిమా రీరిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ని మెగా అభిమానులు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన నేపథ్యంలో సింహాద్రి సినిమా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏరియాల వారీగా ఇబ్బందుల్లో ఉన్న నందమూరి అభిమానులకు ఇచ్చి సాయపడాలని నిర్ణయించారు ఎన్టీఆర్ అభిమానులు.

ఈ క్రమంలో కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించామని ప్రకటించుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏరియాల వారీగా డబ్బులు పంచే సమయంలో పారదర్శకత చూపుతారా అన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా సింహాద్రి రెండవ రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని సమాచారం అందుతోంది, రెండో 20లక్షలు కూడా వసూలు చేయలేకపోయిందని అంటున్నారు. దీంతో మెగా అభిమానులు మరింతగా ట్రోల్ చేయటం మొదలు పెట్టారు నందమూరి అభిమానులను. సరదాగా మొదలైన ఈ ట్రెండ్ హీరోల అభిమానుల మధ్య అనవసర పోటీకి దారి తీయటంతో ఈ ట్రెండ్ కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు