Prabhas: ఆదిపురుష్ పై ఆగని ట్రోల్స్..!

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఎంతటి డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ కూడా చేరుకోలేని పరిస్థితిలో ఉంది. 10రోజులకు గాను 450కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ నష్టాన్ని కొంచెం అయినా తగ్గించాలని చేసిన ప్లాన్ లో భాగంగా టికెట్ రేట్ ని 112కి తగ్గిస్తూ అనౌన్స్ చేసింది. సాధారణంగా ఏ సినిమాకైనా టికెట్ రేట్ తగ్గిస్తే కాస్తో కూస్తో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది కానీ, ఆదిపురుష్ కి ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు.

టికెట్ రేట్ తగ్గిస్తే కాదు, ఫ్రీగా చూపించినా కూడా సినిమా చూడమంటూ కొంత మంది ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణం లాంటి ఎపిక్ స్టోరీని ఇష్టం వచ్చిన మార్పులు చేసిన ఓం రౌత్ టీం కి ఆడియెన్స్ గుణపాఠం నేర్పించారని చెప్పాలి. అయితే, పదిరోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకొని సినిమా యూనిట్ పొరపాటు చేసిందని చెప్పాలి.

సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే ఈ నిర్ణయం గనక తీసుకొని ఉండుంటే పరిస్థితి కొంచెమైనా బెటర్ గా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టిన ఆదిపురుష్ కథా కథనాలలోని లోపాల వల్ల ఫ్లాప్ దిశగా పయనిస్తోందని చెప్పచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు