Tollywood: ఆఫర్స్ లేవా? ఇష్టం లేదా?

టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన “ఫిదా” సినిమా తో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా తోనే మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. తెలుగులో చక్కగా మాట్లాడగల హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. తన ప్రతి సినిమా కి తెలుగులో తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఎక్స్ పోసింగ్ కు దూరంగా ఉండే ఈ హీరోయిన్ తన క్యారెక్టర్ తో అందరి మనసుల్ని దోచుకుంది. సాయి పల్లవి ప్రతి సినిమాను రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండేలా, తన పాత్ర ఎలివేట్ అయ్యేలా చూసుకుంటుంది. అందుకే తక్కువ సినిమాలు చేసిన టాలీవుడ్ లో హీరోలకు ధీటుగా ఫ్యాన్ బేస్ ని కలిగి ఉంది. ఫ్యాన్స్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు లో ఏ మూవీ చెయ్యట్లేదు.

గత సంవత్సరం జూన్ లో వచ్చిన విరాట పర్వం సాయి పల్లవి తెలుగు లో చేసిన లాస్ట్ మూవీ. ఆ తర్వాత ఏ మూవీ కూడా అనౌన్స్ చెయ్యలేదు. మరి సాయి పల్లవి సినిమాలు చెయ్యకపోవడానికి గల కారణాలు ఏమిటో ఫ్యాన్స్ కి అర్ధం కావట్లేదు. ఇక్కడ ఆఫర్స్ లేకనా? లేదా ఇష్టం లేకపోవడమా అన్నది తెలియదు. అయితే టాలీవుడ్ లో హీరోయిన్ల విషయం లో ఒక సెంటిమెంట్ ఉంది. హీరోయిన్స్ ఎక్స్ పోసింగ్ చేస్తే సినిమా హిట్ అని, ఆ హీరోయిన్స్ టాప్ హీరోయిన్లు అవుతారని అంటారు. కాజల్, తమన్నా, సమంత, పూజా హెగ్డే వీళ్లంతా ఆలా వచ్చిన వారే. కానీ సాయి పల్లవి దీనికి పూర్తి విరుద్ధం. తన నటన ని ఇంకా వ్యక్తిగత ప్రవర్తన తోనే మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది.

అయితే సాయి పల్లవి ఒక డాక్టర్ అన్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తను పుట్టి పెరిగిన ఊరు కోయంబత్తూర్ లో సాయి పల్లవి సొంత ఖర్చులతో హాస్పిటల్ కట్టిస్తుందని ఆ పనుల్లో ఉండడం వల్ల ప్రస్తుతం ఆమె ఏ సినిమాను చేయట్లేదని తెలుస్తుంది. హాస్పిటల్ పని పూర్తయ్యాక మళ్ళీ సినిమాలు చేస్తుందని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు