SPY: మరో ఇంట్రెస్టింగ్ కథతో రాబోతున్న నిఖిల్..!

హ్యాపీడేస్ తర్వాత టాలీవుడ్ కి పరిచయమైన హీరో నిఖిల్ సిద్దార్థ్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకొని యువత లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత రొటీన్ కథలతో సినిమాలు తీసి వరుస ఫ్లాప్స్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్టోరీ సెలెక్షన్ మార్చిన నిఖిల్ స్వామిరారా,కార్తికేయ వంటి సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. గత ఏడాది వచ్చిన కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకోవటమే కాకుండా 100కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. మీడియం రేంజ్ హీరోల్లో 100కోట్ల క్లబ్ లో చేరిన హీరోల్లో నిఖిల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడని చెప్పచ్చు. కార్తికేయ2 సినిమా తర్వాత కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న నిఖిల్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.

ప్రస్తుతం నిఖిల్ నటించిన స్పై సినిమా జూన్ 29న రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఆ తర్వాత వీ – మెగా  పిక్చర్స్ బ్యానర్ పై ది ఇండియా హౌస్, ఠాగూర్ మధు బ్యానర్ పై స్వయంభు అనే మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలు కావటం విశేషం. ప్రస్తుతం స్పై సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిఖిల్ ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ నిఖిల్ ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అడగగా, ప్లాస్టిక్ పొల్యూషన్ పై కథతో ఒక డైరెక్టర్ కలిసాడని త్వరలోనే ఆ సినిమా చేయనున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు నిఖిల్. కార్తికేయ2 తో పాన్ ఇండియా హిట్ అందుకోవటమే కాకుండా 100కోట్ల క్లబ్ లో చేరిన నిఖిల్ స్పై సినిమాతో ఆ హిట్ పరంపరని కొనసాగిస్తాడు లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు