యంగ్ హీరో శర్వానంద్ కి ఇటీవలనే పెళ్లి అయిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ హై కోర్ట్ న్యాయవాది కూతురైన రక్షిత రెడ్డి – శర్వానంద్ ఇద్దరు ప్రేమించుకోగా, ఇటీవలనే పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జైపూర్ లోని లీల ప్యాలస్ లో పెళ్లి చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అవడం మూలాన ఈ పెళ్ళికి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ తప్ప ఎవరు అటెండ్ అవ్వలేదు. అయితే ఇటీవలనే హైదరాబాద్ లో కూడా వీళ్లా పెళ్లి రిసెప్షన్ ఫంక్షన్ ఏర్పాటు చేయగా సెలెబ్రెటీలంతా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక పెళ్లి తరువాత ఈ యంగ్ హీరో హనీమూన్ వెళ్తాడేమో అనుకుంటే, అందరికి ఆశ్చర్య పరిచే విధంగా కొత్త పెళ్లి కొడుకు శర్వానంద్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కంప్లిట్ చేసే పనిలో పడ్డాడు. శర్వానంద్ పెళ్లి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో, అనుకున్న టైంకి రిలీజ్ కష్టమవుతోంది అనే ఉద్దేశ్యంతో శర్వానంద్ షూటింగ్ పూర్తి చేద్దామనుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల ప్రతిష్టాత్మకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదేశాలలో కొంత షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్ ని ఇటీవలనే చూసిన శర్వానంద్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యపై సీరియస్ అయ్యాడంట, డైరెక్టర్ చెప్పిన కథకి, తయారైన సినిమాకి చాలా వరకు వైవిధ్యం రావడంతో శర్వానంద్ అసహనంగా ఉన్నడట. ఈ కారణంగా శర్వానంద్ సినిమాకి షూటింగ్ డేట్స్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదట. దాంతో యూనిట్ అంత అయోమయంలో పడ్డారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.