Manmadhudu: నాగ్ కూడా వస్తున్నాడు. ఇక వెంకీయే మిగిలాడు?

Manmadhudu re release:

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ కి పోకిరి పునాది వేయగా, ఖుషి తో గట్టిగా పాతుకుపోయింది. ఈ ట్రెండ్ ఎంత వరకు పోయిందంటే ప్లాప్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యేంత, చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాల లెవెల్లో కలెక్షన్లు వసూలు చేసేంత, ఆఖరికి డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో రీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తున్నాయి.

ఇక టాలీవుడ్ లో టాప్ హీరోల నుండి సీనియర్ స్టార్ హీరోల వరకు ఇప్పుడు అందరి సినిమాలు రీ రిలీజ్ అయిపోయాయి. ఇందులో కేవలం ఇద్దరు హీరోలే మిగిలారు. ఇప్పుడు వారు కూడా త్వరలో చేరబోతున్నారు. టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, తో పాటు రవితేజ సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నాగార్జున కూడా చేరిపోతున్నాడు.

ఆగష్టు 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా నాగార్జున సూపర్ హిట్ మూవీ మన్మధుడు సినిమా నీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ నాగార్జున సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ వారు సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఇక టాప్ హీరోలలో మిగిలింది వెంకటేష్ ఒక్కడే.

- Advertisement -

వెంకటేష్ నటించిన ఏ సినిమా కూడా రీ రిలీజ్ కాలేదు. అయితే వెంకటేష్ బర్త్ డే కానుకగా ఆయన నటించిన “జయం మనదేరా”, లేదా గణేష్ సినిమాని రీ రిలీజ్ చేయాలనీ వెంకీ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయాన్నీ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇక వెంకటేష్ సినిమా రీ రిలీజ్ అయితే స్టార్ హీరోల్లో అందరి సినిమా రీ రిలీజ్ అయినట్టే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు