chiranjeevi: అల్లుళ్లకు తీవ్ర అన్యాయం చేస్తున్న మెగాస్టార్..!

టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్న రెండు మూడు కుటుంబాలలో ఒకటి మెగా ఫ్యామిలీ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడుపదుల వయసులో కూడా ఇప్పటికీ ఇదే హుషారుతో సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు చిరు. ఇక ఈయన పేరు చెప్పుకొని మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక ఇలా మెగా ఫ్యామిలీలో చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే ఒక సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి వారు వారి సొంత నిర్ణయాలతో కథలని ఎంచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు. కానీ మిగతా హీరోలు చేయాల్సిన సినిమాల కథలని ముగ్గురు మెగా బ్రదర్స్ విన్న తర్వాతనే దర్శకులకు ఓకే చెబుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మెగా అల్లుళ్ళు నటిస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత సక్సెస్ ని సాధించలేకపోతున్నాయి.

అంతేకాదు చిరంజీవి కూడా తన కథల విషయంలో కూడా సరిగ్గా ఎంచుకోలేకపోతున్నారు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందుకే ఆయన సినిమాలు ఎక్కువగా ప్లాప్స్ అవుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తన అల్లుళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని.. ఆయన కథలతోపాటు మెగా అల్లుళ్ళ కెరీర్ పై కూడా దృష్టి పెట్టాలని కామెంట్స్ చేస్తున్నారు

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు