Mahesh Babu : సురేందర్ తో మరోసారి ?

సర్కారు వారి పాటతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు రాజమౌళితో మేజర్ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న SSMB28 సినిమా షూటింగ్ ఈ ఆగస్టులో స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. దీని తర్వాత రాజమౌళితో చేసే సినిమా ఆలస్యమవుతుందని సమాచారం అందుతుంది. మహేష్ కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయాలేదట. అందుకే ఆలస్యమవుతుందని తెలుస్తుంది.

ఈ గ్యాప్ లో మహేష్ బాబు ఏం చేస్తాడు అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే రాజమౌళితో చేసే సినిమాకు ముందు, మరో సినిమా చేయాలనే ఆలోచన మహేష్ కు ఉందని సమాచారం. దీన్ని ప్రిన్స్ సన్నిహితులు చెప్పారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని కోసం మహేష్ కథలు కూడా వింటున్నాడని టాక్ వినిపిస్తుంది. ముందుగా అనిల్ రావిపూడితో గానీ, పరుశురామ్ తో గానీ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.

తాజాగా మరో దర్శకుడి పేరు వినిపిస్తుంది. మహేష్ తో అతిథి సినిమా చేసిన సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ వార్తతో మహేష్ ఫ్యాన్స్ కూడా ఖుషీ గా ఉన్నారు. ఎందుకంటే, అతిథి సినిమాలో మహేష్ ను కొత్తగా, స్టైలీష్ గా చూపించాడు సురేందర్ రెడ్డి. మళ్లీ ఇప్పుడు సినిమా అంటే, మరోసారి మహేష్ కొత్తగా చూడచ్చు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే సురేందర్ రెడ్డితో సినిమా.. రాజమౌళితో చేసి చిత్రం కంటే ముందు ఉంటుందా లేదా తర్వాత ఉంటుందా.. లేదా అసలు ఉంటుందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు