The Crew : బాలీవుడ్‌లో బయోపిక్‌కు రెడీ అవుతున్న ట్రెండీ జానికి

సినిమా రంగంలో జానకి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పాత తరం నుంచి ఈ తరం వరకు సీత పాత్ర చేసిన హీరోయిన్ల కెరీర్ ఒక రేంజ్ లో వెలిగిపోయింది. తాజాగా ఈ ట్రెండీ యుగంలో సీత పాత్రను బాలీవుడ్ నటి కృతి సనన్ పోషించింది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా వచ్చిన ఆదిపురుష్ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత కృతికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలకు మాడ్రన్ సీత గ్రీన్ సగ్నల్ ఇచ్చింది.

తాజాగా మరో సినిమా కోసం కృతి సనన్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సారి విభిన్నమైన కథతో కృతి సనన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఈ బాలీవుడ్ బ్యూటీ మొదటి సారి బయోపిక్ లో నటించబోతుందని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. అలనాటి నటి, దివంగత మీనా కుమారి బయోపిక్ చేయడానికి బాలీవుడ్ లో సన్నాహాకాలు జరగుతున్నాయి. ఈ బయోపిక్ ను మనీష్ మల్హోత్రా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అలాగే భూషణ్ కుమార్ ప్రతిష్టాత్మికంగా నిర్మించబోతున్నాడు. దీనిలో టైటిల్ పాత్ర కోసం పలువరు బాలీవుడ్ హీరోయిన్లును సంప్రదించారట.

ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ చర్చలు కృతి సనన్ దగ్గరకు వచ్చాయని తెలుస్తుంది. పాత్ర, స్టోరీ నచ్చడంతో కృతి సనన్ కూడా ఈ బయోపిక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, దివంగత నటి మీనా కుమారి గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఈమె నటించిన ఫుల్ ఔర్ పత్తర్, బైజు బావ్రా, పాకీజా వంటి సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. పాకీజా తో మీనా కుమారికి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి నటి బయోపిక్ అంటే, మంచి అంచనాలు ఉన్నాయి.’

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు