Koratala : ఫైనల్ గా మహేష్ హీరోయిన్

మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కావడంతో NTR 30 ప్రాజెక్టు పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా గా రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ పథకం పై కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఐదు భాషలలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అందుకు గాను.. నటీ నటులను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీసుకోవాలని డైరెక్టర్ కొరటాల శివ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు సినీ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్. నిజానికి ఆలియా భట్ హీరోయిన్ గా నటించాల్సింది. కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది.

దీని తర్వాత పలువురి బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ అవేవీ కూడా ఖరారు ఖాలేదు. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ పేరు చర్చకు వస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే మహేష్ తో భరత్ అనే నేను అనే సినిమాలో నటించిన కియారా అద్వానిని మూవీ టీం ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. కియారా అద్వానికి టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ సినిమాకు ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు