Janhvi Kapoor : స్పై థ్రిల్లర్ చిత్రంలో..

భారతీయ సినిమాను ఏలిన తక్కువ మంది హీరోయిన్ లలో శ్రీ దేవి ఒకరు. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి.. స్టార్ హీరోయిన్ గా మారడమే కాకుండా, కొన్ని రోజుల్లోనే అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుంది. ఈ అతిలోక సుందరి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచమైంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా, విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకి ఫాలోవర్స్ ను కూడా ఎక్కువే ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తుంది. అవి మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయినా, ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు వస్తుంది. ఈమె ఇటీవల “గుడ్ లక్ జెర్రీ”, “మిలి” అనే సినిమాలు చేసింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లపడ్డాయి. కానీ, జాన్వీ నటనకు ప్రశంసలు వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

“రాజీ” సినిమాను తెరకెక్కించిన సుధాన్షు సరియా దర్శకత్వంలో “ఉలఝ్” అనే చిత్రం రాబోతుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా మొత్తం మూడు పాత్రల చూట్టు తీరుగుతుందట. అందులో ఒక పాత్రలో మలయాళ నటుడు రోషన్ మథ్యూ కనిపించబోతున్నాడు. మరో పాత్ర కోసం ఒక సీనియర్ నటుడిని సంప్రదిస్తున్నారు. కాగా ముఖ్యమైన హీరోయిన్ పాత్రను జాన్వీ కపూర్ చేయబోతుందని సమాచారం. జాన్వీతో ఇప్పటికే ఉలఝ్ స్టోరీ పరమైన చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు