తమిళ స్టార్ హీరోలలో ఒకరైనటువంటి కార్తీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల కార్తీ మణిరత్నం దర్వకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్లో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారూఖ్ కూడా మంచి ఆదరణ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం షారూఖ్ మాస్ కం బ్యాక్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే షారూఖ్ కూడా అదేవిధంగా సెట్ చేసుకున్నాడు. షారూఖ్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ ‘జవాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం సర్దార్. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21న సర్దార్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విచిత్రమైన విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు కూడా ఒకటే కథ అని తమిళ సినీ ట్రాకర్స్ పేర్కొంటున్నారు.
ఇలాంటి సందర్భాలు ఇదివరకు చాలా వరకు విని ఉంటాం. కానీ ఇలా ఇద్దరూ స్టార్స్ అందులో షారూఖ్ ఖాన్ పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు. ఇక రెండు కథలు ఒకటే అయితే పరిస్థితి ఏంటనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు సినిమాలు విడుదలయ్యేంత వరకు ఎదురుచూస్తే కానీ వీటిపై ఓ క్లారిటీ రాదు.