రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారు ఎవ్వరుండరు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదలవ్వడం విశేషం. ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా ఆశించిన మేరకు ఆకట్టుకోలేదు. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్, సెప్టెంబర్ లో సలార్ సినిమాలు విడుదల కానున్నాయి.
తాజాగా ప్రభాస్, రిషబ్ శెట్టి నటించిన ‘కాంతారా’ సినిమాను రెండు సార్లు చూశానని.. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని చెప్పాడు. మరో విశేషం ఏంటంటే కేజీఎఫ్, కాంతారా సినిమాలను నిర్మించింది హోంబల్ నిర్మాణ సంస్థ కావడం విశేషం. సలార్ సినిమాని కూడా అదే సంస్థ నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్లో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమా భారీ హైప్ సెట్ చేసుకున్న విషయం చూస్తూనే ఉన్నాం. తాజాగా వచ్చినా ‘కాంతారా’ సెన్సేషన్ని నమోదు చేసింది. కాంతారాలో క్లైమాక్స్ కోసం చాలా మంది మాట్లాడుకోవడం విశేషం. ఈ క్లైమాక్స్ చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా ఎంజాయ్ చేశాడట. తమ సలార్లో క్లైమాక్స్ ని కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసే రేంజ్ క్లాస్ లో నిలబెడతామని ఓ అప్డేట్ని రివీల్ చేశారు. దీంతో సలార్ క్లైమాక్స్ అంశం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.