Power Star: OG కోసం అప్పటివరకు  వెయిట్ చేయాల్సిందేనా..?

రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం వరుసగా సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఒక పక్క క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్లో ఓజీ ఇలా మూడు సినిమాలతో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు పవన్. ఇటీవలే ఓజీ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లిమ్ప్స్ వీడియో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే, ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్  మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఫ్యాన్స్ కొద్దిపాటి నిరాశ కలిగించేలా ఉంది. అదేంటంటే, ఈ సినిమా రిలీజ్ 2025 సంక్రాతి నాటికి ప్లాన్ చేస్తున్నారట. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ మైంటైన్ చేయాలని పవన్ కళ్యాణ్ బావించటమే ఇందుకు కారణం అని తెలుస్తుంది. 2024లో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అలరిస్తాడు అని భావించిన ఫ్యాన్స్ కి ఇది ఒకరకంగా చేదు వార్త అని చెప్పాలి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న పవన్ ‘ఓజీ’ ని తర్వాత ఏడాదికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో చాలా కాలం క్రితం మొదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కారణాలు స్పష్టంగా తెలీదు కానీ ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ నత్త నడకన సాగుతోంది. ఏది ఏమైనా పవన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడన్న ఆనంద పడ్డ ఫ్యాన్స్ ఓజీ రిలీజ్ డిలే అవనుంది అంటూ వస్తున్న వార్తలతో కొద్దిగా డీలా పడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు