Nayanthara: పెళ్లి తర్వాత ఈ బ్యూటీకి శని పట్టిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీలో నయనతార స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నయనతార హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా స్టార్ హీరోలకు జోడిగా నటించి కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఈమె ఒక్కరే.

ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు ఎవరికి సాధ్యం కానీ విధంగా హీరోలకు ధీటుగా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ గా నిలుస్తుంది నయనతార. ఓవైపు మహిళా ప్రధాన చిత్రాలు, మరోవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూ కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార, సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార సరోగసి ఎంచుకోవడంపై పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కానీ నయన్ కి ఇలాంటి వివాదాలు పెద్ద సమస్య కాదు.

ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది. ఇదిలా ఉంటే, పెళ్లయినప్పటి నుంచి స్టార్ జోడీకి శని పట్టుకుందట. అప్పట్లో పట్టిందల్లా బంగారం అయితే, ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనే స్టేజ్ లో ఉన్నారట. నిన్న మొన్నటి వరకు చేతిలో అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న నయన్, పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉంటుందట. భర్త పెట్టిన కండిషన్ కారణమా, లేక రెమ్యూనరేషన్ కారణమా తెలీదు. కానీ ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాల నుంచి తప్పుకోగా, ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీలో నటిస్తూనే ఇంట్లో పిల్లలను చూసుకుంటూందట నయనతార.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు