Guntur Kaaram: ఇక సంక్రాంతికి కష్టమే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలాకాలం అవుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఆ మధ్య మహేష్ బాబు అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా పడగా, జూలై మొదటి వారంలో షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా 12కి వాయిదా వేశారు. త్రివిక్రమ్ కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల మళ్లీ 20కి వాయిదా వేయగా, ఇప్పుడు కూడా వాయిదా పడ్డట్టు వార్తలొస్తున్నాయి. హీరోయిన్ పూజ హెగ్డే డేట్స్ తో పాటు మరో కీలక పాత్రలో నటిస్తున్న నటుడి డేట్స్ కుదరకపోవడం వల్ల జులై మొదటి వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతూ వస్తుండటంతో మహేష్ అభిమానులు త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపగా, షూటింగ్ వాయిదా అన్న వార్తలు ఆ ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నాయి. 2024 సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటినుండి గ్యాప్ లేకుండా జరిగితే తప్ప అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశం లేదు.

ఈ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్, సునీల్, జగపతి బాబు, రమ్యకృష్ణ వంటి చాలా మంది స్టార్ క్యాస్టింగ్ ఉండటం వల్ల అందరి డేట్స్ ఒకేసారి కుదరటం సమస్యగా మారడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తుందని అంటున్నారు. ఇంకా చాలా భాగం షూటింగ్ పెండింగ్ ఉన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వటం కష్టమేనని అభిప్రాయం వెలువడుతోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావటంతో భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యి మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు