Tarun bhasker: తొలిప్రేమ కంటే ఆ సినిమాకే ఎక్కువ షోలు?

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “ఈ నగరానికి ఏమైంది” ఎంత పెద్ద సక్సెసో అందరికి తెలిసిందే. పెళ్లి చూపులు తరువాత తరుణ్ భాస్కర్ తీసిన రెండవ చిత్రమిది. 2018 లో వచ్చిన ఈ సినిమా మొదట ప్రేక్షకులు పట్టించుకోకపోయినా మౌత్ టాక్ తో ప్రారంభించి భారీ హిట్ అయ్యింది. చాలా మంది యూత్ కి ఈ సినిమా ఫేవెరెట్. ఇప్పడు గోవా కి వెళ్లే చాలా మంది ఈ సినిమా చూసి వెళ్లిన వారు కూడా ఉన్నారు.

అయితే ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 29న “ఈ నగరానికి ఏమైంది” సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తునట్టు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రకటించాడు. అయితే చాలా మంది ఇదంత పాత సినిమా కాదు, పైగా స్టార్ హీరోల సినిమా కూడా కాదు, ఎవరు ఈ సినిమా చూస్తారులే అనుకున్నారు. కానీ అవుతున్న బుకింగ్స్ చూసి షాక్ అవుతున్నారు అందరు.

అయితే సినిమా రిలీజ్ అవుతున్న నెక్స్ట్ డే నే పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ” కూడా రీ రిలీజ్ అవుతుంది. కానీ ఆ సినిమా కంటే కూడా ఎక్కువ బుకింగ్స్ ఈ నగరానికి ఏమైంది సినిమాకు జరగడం విశేషం. ఇది గమనించిన థియేటర్ యజమానులు చాలా చోట్ల ఎక్స్ట్రా షో లు కూడా వేస్తున్నారు. పైగా ఆ రోజు కొత్త సినిమాలు “స్పై”, “సామజవరగమన” చిత్రాలు కూడా రీలీజ్ అవుతున్నాయి. అయినా కూడా ఈ సినిమాకు ఇన్ని షోలు పడుతున్నాయంటే ఈ సినిమా ఆడియన్స్ పై ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్న థియేటర్లలోనే తరుణ్ భాస్కర్ తీస్తున్న కొత్త సినిమా కీడా కోలా టీజర్ ను ప్రదర్శిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా అంతకుముందే జూన్28న యూట్యూబ్ లో మధ్యాహ్నం 1.50 గంటలకు విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్లలో ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు