Ghost: త్వరలోనే వింటేజ్ నాగ్ ని చూడబోతున్నామా?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల్లో చాలా వెనకబడిపోయాడు. తన తోటి హీరోలు వరుస హిట్లతో దూసుకుపోతుంటే నాగార్జున మాత్రం వరుస ప్లాప్ లతో డైలమా లో పడ్డాడు. చివరగా ఘోస్ట్ సినిమా తో డిజాస్టర్ ని అందుకున్న నాగార్జున ఇప్పుడు ఎలాగైనా భారీ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న నాగార్జున పలు దర్శకుల కథలు, స్క్రిప్టులు వింటున్నాడు. వారిలో కళ్యాణ్ కృష్ణ, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు కూడా ఉన్నారు.

అయితే రీసెంట్ గా విక్రమ్ కుమార్ వినిపించిన ఒక కథ నాగార్జున కి బాగా నచ్చినట్టు ఆ కథని ఓకే చేసినట్టు వార్తలు వినబడుతున్నాయి. అది ఒక ఫామిలీ డ్రామా గా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు టాక్. నాగార్జున కి ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయని తెలిసిందే. ఆయన ప్లాపుల్లో ఉన్నప్పుడల్లా ఫ్యామిలీ, కామెడీ సినిమాల్తో వచ్చి హిట్టు కొట్టారు. నువ్వు వస్తావని, సంతోషం, మనం లాంటి సినిమాలు నాగార్జున కెరీర్ లో అలా వచ్చినవే.

అటు విక్రమ్ కుమార్ కి కూడా నాగార్జునతో మంచి క్లోజ్ బాండింగ్ ఉంది. అక్కినేని ఫ్యామిలీ హీరోలనందరిని డైరెక్ట్ చేసిన ఘనత “మనం” సినిమాతో విక్రమ్ కుమార్ దక్కించుకున్నాడు. ఆ చనువుతోనే నాగార్జున తో సినిమా చేస్తున్నాడని సమాచారం. ఇక విక్రమ్ కుమార్ కూడా ఇటీవల నాగచైతన్య తో థ్యాంక్ యు సినిమా తీసి ప్లాప్ అందుకున్నాడు. కనుక మళ్ళీ మంచి హిట్ తో కం బ్యాక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి నాగార్జునతో సినిమా తీస్తున్నాడన్న సమాచారం నిజమే అయితే మళ్ళీ వింటేజ్ నాగార్జున ని చూడటం కన్ఫర్మ్ అనే చెప్పాలి. ఈ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే నాగార్జున నుండి అఫిషియల్ గా అప్డేట్ రావాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు