Prabhas: ప్రాజెక్ట్ కే సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రాజెక్ట్ కే సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. గతంలో కూడా పలు రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఈయన లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కే సినిమా పై మాట్లాడటంతో మరోసారి వార్తల్లోకెక్కాడు.

ప్రభాస్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా ప్రాజెక్ట్ కే ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్,దిశాపటాని ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

ఇక ఇటీవలనే ప్రాజెక్ట్ కే సినిమా సెట్ కు వెళ్లిన తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టగా, ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ గా మారాయి. ప్రాజెక్ట్ కే సినిమా సెట్ చూస్తే ఆయనకు కళ్ళు తిరిగియని, ఆ సినిమాలో ఉన్న క్యాస్టింగ్ చూసి షాక్ అయ్యానని చెబుతూ మొదటి రోజే ఆ సినిమా 1500 కోట్లు కలెక్షన్స్ రాబడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రాజెక్ట్ కే సినిమా విడుదల అవుతుందేమో అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. దాదాపు ఏ సినిమా గురించైనా నెగిటివ్ గా మాట్లాడే స్వభావం ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రాజెక్ట్ కే సినిమా గురించి ఇంత పాజిటివ్ మాట్లాడటంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు